Chandrababu: చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా జగన్‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారనే అడిగేవారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • టీడీపీ సర్కారు రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది 
  • చంద్రబాబు చాలా సార్లు ఢిల్లీకి వెళ్లారు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చలు జరపలేదు
  • అసెంబ్లీ సీట్లు ఎప్పుడు పెంచుతారు? అనే అడిగారు

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని ఆధారాలతో పాటు నిరూపిస్తానని, నిరూపించలేకపోతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... వైసీపీ, జనసేనతో తమ పార్టీకి ఎలాంటి ఒప్పందాలు లేవని అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చలు జరపలేదని, ఎప్పుడెళ్లినా జగన్‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారు? అసెంబ్లీ సీట్లు ఎప్పుడు పెంచుతారు? అనే విషయాలే అడిగేవారని, అలాగే 'నాకేంటీ?' అని కూడా అడిగారని అన్నారు. టీడీపీ సర్కారు రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారని అన్నారు.

రాష్ట్రానికి కేంద్ర సర్కారు చేస్తోన్న సాయాన్ని ప్రజలకు వివరించి చెబుతానని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్ర సర్కారు అందిస్తోన్న సాయంపై దుష్ప్రచారం చేస్తున్నారని, మిగతా రాష్ట్రాల కంటే ఏపీకే కేంద్ర సర్కారు ఎక్కువ సాయం అందిస్తోందని చెప్పుకొచ్చారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. తాము 2019లో ఏపీలో అధికారంలోకి వస్తామని కన్నా ధీమాగా చెప్పారు.

  • Loading...

More Telugu News