chandrababu: వాజ్ పేయిని పరామర్శించిన చంద్రబాబు

  • నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే ఎయిమ్స్ కు వెళ్లిన చంద్రబాబు
  • వాజ్ పేయి ఆరోగ్యం గురించి వైద్యులతో ఆరా
  • కాసేపట్లో తిరుగుపయనం కానున్న సీఎం

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వాజ్ పేయి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే, అక్కడి నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు చంద్రబాబు. వాజ్ పేయిని పరామర్శించిన అనంతరం, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణం కానున్నారు.

  • Loading...

More Telugu News