KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ అహ్వానం

  • ఇండో జర్మన్ కోపరేషన్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్ మెంట్ అహ్వానం
  • జర్మనీలో అధ్యయనానికి రావాల్సిందిగా లేఖ
  • ఈ నెల 25 నుంచి 27 వరకు జర్మనీలో పర్యటించాలని వినతి

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ అహ్వానం లభించింది. జర్మనీలో అధ్యయనానికి రావాల్సిందిగా ఇండో జర్మన్ కోపరేషన్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్ మెంట్ అహ్వానం పంపింది. జర్మనీలో విత్తన ఉత్పత్తి అభివృద్ధి ఇంప్లిమెంట్ ఏజెన్సీ అయిన ఏడీటీ ప్రాజెక్ట్ ఈమేరకు మంత్రికి ప్రత్యేకంగా ఒక లేఖ రాసింది. గతంలో ఒకసారి జర్మనీలో పర్యటించాల్సిందిగా కోరినప్పటికీ మంత్రికి బీజీ షెడ్యూళ్ల వలన రాలేక పోయారని, ఇప్పుడు జర్మనీకి రావాలని మరోసారి కోరింది.

ఈ నెల 25 నుంచి 27 వరకు జర్మనీలో పర్యటించి విత్తన రంగంపై అధ్యయనం చేయాలని కోరింది. ఈ మేరకు అక్కడి వివిధ కంపెనీలతో పాటు విత్తనోత్పత్తి కేంద్రాల్లో పర్యటించేందుకు అన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌కి తెలిపింది. ఈ అధ్యయనం తెలంగాణలో విత్తన పార్కు ఏర్పాటుకు సహకరిస్తుందని తెలిపింది. అలాగే, జూన్ నాలుగో వారంలో జర్మనీలో పర్యటించి ఈ నెల 26న బెర్లిన్‌లో జరిగే వరల్డ్ పుడ్ కన్వెన్షన్ కు హాజరు కావాలని కోరింది.

  • Loading...

More Telugu News