Hyderabad: ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను స్వయంగా కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు!

  • హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడలో ఘటన
  • ఏప్రిల్ 24న ఆర్యసమాజ్ లో ఆనంద్, రుచితల వివాహం
  • ఆనంద్ ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసిన రుచిత తల్లిదండ్రులు

ప్రేమ వివాహం చేసుకున్న యువతిని, అత్తింటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో తల్లిదండ్రులు. హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, కుషాయిగూడలో ఉంటూ, ఓ బోర్ వెల్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్న అరుగుల ఆనంద్ (25), కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ కు చెందిన పప్పుల రుచిత (22)ను ప్రేమించాడు.

అయితే, వీరి పెళ్లికి రుచిత తల్లిదండ్రులు శ్రీధర్, భవానీ అంగీకరించలేదు. విడిపోయి ఉండలేమని భావించిన ఆనంద్, రుచితను ఏప్రిల్ 24న ఆర్యసమాజ్ లో వివాహం చేసుకుని, ఆపై తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సమయంలో శ్రీధర్, భవాని, మరో ఇద్దరితో కలసి కారులో కుషాయిగూడకు వచ్చారు. ఆనంద్ తల్లి యాదమ్మను కొట్టి రుచితను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆ ప్రాంతం నుంచి వేగంగా వెళుతూ వారి కారు చేసిన ఫీట్లకు స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News