Srisailam: వర్షాల ఎఫెక్ట్... నెమ్మదిగా నిండుతున్న రిజర్వాయర్లు!

  • ఎగువన కురుస్తున్న వర్షాలు
  • పలు ప్రాజెక్టులకు వస్తున్న వరద నీరు
  • రైతుల అవసరాలకు నీటి విడుదల

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్, జూరాల ప్రాజెక్టులకు వరద కొనసాగుతుండటం, వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతూ ఉండటంతో రిజర్వాయర్లు నెమ్మదిగా నిండుతున్నాయి. ఈ ఉదయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద 13,690 క్యూసెక్కులుగా, జూరాలకు 2,808 క్యూసెక్కులుగా వరద నమోదైంది.

శ్రీరాంసాగర్ లో 46.95 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జూరాలలో 8.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీటికి, కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు తోడు కావడంతో శ్రీశైలానికి 5 వేల క్యూసెక్కులకు పైగా, నాగార్జున సాగర్ కు 8 వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది. రైతుల అవసరాల నిమిత్తం రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతున్నారు. ఇక నారాయణపూర్ రిజర్వాయర్ కు 11,720 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 12,067 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Srisailam
Nagarjuna Sagar
Rains
Karnataka
Jurala
Sriram Sagar
Narayanapur
  • Loading...

More Telugu News