Uttam Kumar Reddy: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ట్విట్టర్‌లో చేసిన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన కేటీఆర్‌

  • గుడిసెలో నివసిస్తోన్న వృద్ధ జంట
  • ఇంటి పన్ను వేసిన అధికారులు
  • సమస్య పరిష్కారానికి కేటీఆర్‌ ఆదేశాలు

కొమరంభీం అసిఫాబాద్‌ జిల్లాలో ఓ వృద్ధ జంట గుడిసెలో నివసిస్తున్నారని, వారికి కూడా రూ.500 ఇంటి పన్ను వేశారని తెలుపుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణ సీఎంవోతో పాటు మంత్రి కేటీఆర్‌కి ట్వీట్‌ చేశారు. వారికి ఆ డబ్బు తిరిగి చెల్లించాలని, అలాగే వెంటనే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్‌... వారి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్వీట్‌ చేశారు. స్థానిక పంచాయతీ సెక్రెటరీకి ఈ విషయం తెలిపి, తప్పును సరిదిద్దుకునేలా చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌కి కేటీఆర్ సూచించారు. అలాగే, వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇవ్వాలని, వారికి ఆసరా పెన్షన్‌ అందుతోందో లేదో తెలుసుకుని, అందకపోతే వచ్చేలా చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News