chiranjeevi: ‘సైరా’ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌

  • చిరంజీవి కథానాయకుడిగా 'సైరా'
  • కొనసాగుతోన్న యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
  • వచ్చే వేసవిలో విడుదల  

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' చిత్రం రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో చాలా కీలకమైన సందర్భంలో వచ్చే యాక్షన్ సీన్ ఇది.

అందువలన ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం .. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ 'గ్రెగ్ పావెల్'ను రంగంలోకి దింపారు. 'స్కై ఫాల్' .. 'హ్యారీ పోటర్' వంటి సినిమాలకు యాక్షన్ డైరెక్టర్ గా ఆయన పనిచేశారు. ఆయన కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో వుండనున్నాయని నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా నయనతార కనిపించనుండగా, అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.  

  • Loading...

More Telugu News