Mahesh Babu: 25వ మూవీలో ఎంబీఏ స్టూడెంట్ గా మహేశ్ బాబు?

  • వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • ఈ నెల 17 నుంచి రెగ్యులర్ షూటింగ్  

మహేశ్ బాబు నుంచి వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా హిట్ తో ఆయన అభిమానులు సంతృప్తి చెందారు. ఆయన తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డెహ్రాడూన్ లో మొదలుకానుంది.

రీసెంట్ గా మహేశ్ బాబు లైట్ గా గెడ్డం పెంచుకుని కెమెరా కళ్లకు చిక్కాడు. దాంతో వంశీ పైడిపల్లి సినిమాలో ఆయన అలాగే కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఆయన పాత్ర ఏమై వుంటుందనే విషయంపై అందరిలోను ఆత్రుత కనిపిస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో, మహేశ్ జోడీగా పూజా హెగ్డే కనిపించనుందనే సంగతి తెలిసిందే.         

  • Loading...

More Telugu News