Vijayawada: రేపు విజయవాడకు రానున్న ఊమెన్ చాందీ

  • ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి హోదాలో చాందీ పర్యటన
  • మూడు రోజుల పాటు విజయవాడలోనే బస
  • విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్న వైనం

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఊమెన్ చాందీ తొలిసారిగా విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 11న ఆయన విజయవాడకు వస్తున్నారని, మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే ఉంటారని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి  కొలనుకొండ శివాజీ తెలిపారు.

ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, వివిధ విభాగాల ఇన్ ఛార్జిలు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చేసే సలహాలు, సూచనలను ఆయన పరిగణనలోకి తీసుకుంటారని, ఈ అవకాశాన్ని కాంగ్రెస్ శ్రేణులందరూ వినియోగించుకోవాలని, ఊమెన్ చాందీ  పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా శివాజీ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News