fish medicine: ముగిసిన చేప ప్రసాదం పంపిణీ!

  • 75,361 మంది చేప ప్రసాదం స్వీకరించారు
  • ఏపీ, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల వారు వచ్చారు
  • హరినాథ్ గౌడ్ ఇంటి వద్ద చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది: నిర్వాహకులు

ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఉచిత చేప ప్రసాదం పంపిణీ ఈరోజు ఉదయంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిన్న ఉదయం చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించామని, ఈరోజుతో ముగించామని చెప్పారు. 75,361 మంది చేప ప్రసాదం స్వీకరించారని, దూద్ బౌలిలోని బత్తిని హరినాథ్ గౌడ్ ఇంటి వద్ద ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని చెప్పారు.

 కాగా, ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చారు. ఇదిలా ఉండగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు, సిబ్బంది, వాలంటీర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతఙ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News