BJP: గవర్నర్ ముందు నాలుగు ప్రధాన డిమాండ్ లు ఉంచిన ఏపీ బీజేపీ నేతలు

  • గవర్నర్ ని కలిసిన ఏపీ బీజేపీ నేతలు
  • మోదీపై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
  • ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావును పదవి నుంచి తొలగించాలి

బీజేపీ ఏపీ నేతలు ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ప్రధానమంత్రి మోదీని దూషించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ కి సమర్పించిన వినతిపత్రంలో ప్రధానంగా నాలుగు డిమాండ్ లు ఉంచారు.

వినతిపత్రం లోని బీజేపీ డిమాండ్లు:

  • మోదీపై అసభ్య పదజాలం ఉపయోగించిన భూమా అఖిల ప్రియను కాబినెట్ నుంచి తొలగించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి
  • ప్రధాని మోదీ, కేంద్ర కేబినెట్ మంత్రులపై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
  • పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లఘించిన వారిపై అనర్హత వేటు వేయాలి
  • బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తూ, ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావును పదవి నుంచి తొలగించాలి

  • Loading...

More Telugu News