rythubandhu: రైతుబంధు చెక్కు వెనక్కి ఇచ్చిన నటుడు తనికెళ్ల భరణి!

  • రైతుబంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • తనకి వచ్చిన చెక్కును తిరిగి ప్రభుత్వానికే అప్పగించిన తనికెళ్ల
  • తనికెళ్ల భరణి కి షాబాద్‌లో రెండున్నర ఎకరాల భూమి

తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద రైతులకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు సీజన్లకు (ఖరీఫ్, రబీ) కలిపి రూ. 8000 వేల సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత మంది ప్రముఖులు తమకు ఇచ్చిన రైతుబంధు చెక్కులను తిరిగి ప్రభుత్వానికే ఇచ్చి వేస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి తనకి వచ్చిన రూ. 10 వేల చెక్కును తిరిగి ప్రభుత్వ అధికారులకు అందజేశారు. కాగా తనికెళ్ల భరణి కి షాబాద్‌లో రెండున్నర ఎకరాల భూమి ఉంది. దీనికిగాను రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందారు.

  • Loading...

More Telugu News