kanna: బీసీ జాతి రత్నం మోదీ: కన్నా లక్ష్మీనారాయణ

  • ప్రధానిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా ప్రశంసలు
  • ఏ రాజకీయ కుటుంబానికి చెందని వ్యక్తి మోదీ 
  • మోదీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓబీసీలదే

ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ లో ఓబీసీ మోర్చా సమావేశంలో పాల్గొనే నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ రాజకీయ కుటుంబానికి చెందని వ్యక్తి మోదీ దేశ ప్రధాని అయ్యారని ప్రశంసించారు. బీసీ జాతి రత్నం మోదీ అని, వెనుకబడిన కులాల నుంచి వచ్చిన ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓబీసీలదేనని అన్నారు. దేశంలో ఉన్న ఓబీసీలంతా కలసికట్టుగా పోరాడాలని ఈ సందర్భంగా కన్నా పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News