YSRCP: వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేసి ప్రొద్దుటూరుకు తరలించిన పోలీసులు

  • పెద్దదండ్లూరు శివారులో ఉద్రిక్త వాతావరణం
  • వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
  • గ్రామంలోకి వెళ్లేందుకు ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రయత్నం
  • అడ్డుకున్న పోలీసులు

కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు శివారులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ మంత్రి ఆది నారాయణరెడ్డికి పట్టున్న ఆ ప్రాంతంలో వైసీపీ నేతల సమావేశాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక వైసీపీ నాయకుడు సంజీవరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి పెద్దదండ్లూరుకి వెళ్తుండగా ఆ గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఆ గ్రామంలోకి ఆయన వెళితే ఉద్రిక్త పరిస్థితి మరింత చెలరేగే అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ప్రొద్దుటూరుకు తరలించారు. పెద్దదండ్లూరులో పోలీసు బందోబస్తు పెంచారు.  

  • Loading...

More Telugu News