rain: ఏపీలో వర్షం.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా!

  • శ్రీకాకుళంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
  • విశాఖలోని పాడేరు, రావి కమతం, బచ్చయ్యపేటల్లో వర్షం 
  • ప్రకాశం జిల్లా చీరాలలో ఈదురుగాలులతో కూడిన వాన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. శ్రీకాకుళంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఆ జిల్లాలోని హిరమండలం భగీరథ పురంలో పిడుగుపడడంతో రాజు అనే 38 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.

విశాఖపట్నంలోని పాడేరు, రావి కమతం, బచ్చయ్యపేటల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. ప్రకాశం జిల్లా చీరాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. నెల్లూరు జిల్లాలో వర్షం కురుస్తోన్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కడప, చిత్తూరు జిల్లాల్లోనూ రానున్న 3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

  • Loading...

More Telugu News