Congress: మంత్రివర్గ కూర్పుపై రెండు పార్టీల మధ్య అవగాహన ఏర్పడింది: కర్ణాటక సీఎం కుమారస్వామి

  • మంత్రి పదవుల కేటాయింపులపై చర్చించాం
  • తలెత్తిన సమస్యలను పరిష్కరించుకున్నాం
  • రాహుల్‌ గాంధీ చాలా చొరవ చూపారు

కర్ణాటకలో మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు చర్చోపచర్చలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈరోజు జేడీఎస్‌ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవుల కేటాయింపుల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకున్నామని, కేబినెట్‌ కూర్పుపై రెండు పార్టీల మధ్య అవగాహన ఏర్పడిందని తెలిపారు.

ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చాలా చొరవ చూపారని కుమారస్వామి అన్నారు. కాగా, కీలక పదవులయిన హోం శాఖను కాంగ్రెస్‌కు, ఆర్థిక శాఖను జేడీఎస్‌కు ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు నిన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News