karthik: కార్తీ మూవీకి టైటిల్ ఖరారు .. కథానాయికగా రకుల్

  • కార్తీ హీరోగా 'దేవ్'
  • కథానాయికగా రకుల్ 
  • రేపటి నుంచి సెకండ్ షెడ్యూల్  

మొదటి నుంచి కూడా కార్తీ వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకుడు రజత్ రవిశంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కంటెంట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి 'దేవ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది.

రెండవ షెడ్యూల్ ను రేపటి నుంచి హైదరాబాద్ లో ఆరంభించనున్నారు. 10 రోజుల పాటు ఇక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆ తరువాత షెడ్యూల్ ను యూరప్ లోను .. హిమాలయాల్లోను ప్లాన్ చేశారు. అక్కడ కీలకమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా రకుల్ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తీరన్ అధిగారం ఒండ్రు' సక్సెస్ టాక్ తెచ్చుకుంది.  

  • Loading...

More Telugu News