jagan: జగన్‌ తో కలసి అడుగేసిన సినీనటుడు పృథ్వీరాజ్

  • భీమవరం సమీపంలోని వీరవాసరం వద్ద పాదయాత్ర
  • వైసీపీ జెండా పట్టుకుని నడిచిన పృథ్వీరాజ్‌
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న పాదయాత్రలో సినీనటుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని వీరవాసరం వద్ద జగన్ ను కలిసిన పృథ్వీరాజ్ పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం వైసీపీ జెండాను పట్టుకుని, పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ పార్టీ తరఫున పృథ్వీరాజ్ గతంలోనూ ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ చేస్తోన్న పోరాటం చాలా గొప్పదని పృథ్వీరాజ్ ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News