Mahesh Babu: మహేశ్ బాబు 25వ మూవీ టైటిల్ గా 'రాజసం?'

  • వంశీ పైడిపల్లితో మహేశ్ మూవీ
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • త్వరలోనే సెట్స్ పైకి  

మహేశ్ బాబు తన 25వ సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో దర్శకుడు వంశీ పైడిపల్లి బిజీగా వున్నాడు. మహేశ్ బాబు కెరియర్లో సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, వంశీ పైడిపల్లి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. మహేశ్ బాబు అభిమానులకి పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగించేలా ఆయన ఈ సినిమా కథను తీర్చిదిద్దాడని అంటున్నారు.

ఈ సినిమా కోసం ఆయన 'రాజసం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఫిల్మ్ నగర్లో ఈ వార్త జోరుగా షికారు చేస్తోంది గానీ, ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే మంచి హైట్ కావడం వలన తెరపై ఈ జంట కనువిందు చేయడం ఖాయమనేది అభిమానుల మాట.  

  • Loading...

More Telugu News