jc: ఇన్నేళ్లు సీఎంగా చేశారు.. ఇక ప్రధాని కావాలి!: 'మహానాడు'లో ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి

  • చంద్రబాబు ఇక ప్రధాని కావాలి
  • లోకేశ్‌ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది?
  • ఎందుకు కాకూడదు?
  • మహానాడులో జేసీ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు విజయవాడలో జరుగుతోన్న మహానాడులో ఆయన మాట్లాడుతూ... "చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానని అంటారు.. ఏంది సర్ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. మేమంతా సంతోషిస్తాం.

నేను మరో విషయం చెబుతా.. ప్రతి వాడు కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారు. టీడీపీని చంద్రబాబే ఈ స్థాయికి తీసుకొచ్చారు. రేపు నారా లోకేశ్‌ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? ఆయన సమర్థుడే కదా.. నేను సంపాదించిన ఆస్తి నా కొడుకుకి ఇవ్వనా.. ఇక్కడ ఎంపీ గల్లా జయదేవ్‌ ఉన్నాడు. ఆయన సంపాదించిన ఆస్తి తన కొడుకుకి ఇవ్వడా.. టీడీపీ అనేది చంద్రబాబు సొంతం. ఆయన కొడుకుకి ఎందుకు ఇవ్వకూడదు? చంద్రబాబు ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు?" అని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదని అన్నారు.

కాగా, వైసీపీ అధినేత జగన్‌కు అన్నీ వాళ్ల తాత బుద్ధులే వచ్చాయని జేసీ అన్నారు. ఆయన ఎప్పుడూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారని చెప్పారు. చంద్రబాబును విమర్శించడమే పనిగా జగన్‌ పెట్టుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ భూ స్థాపితం అయిందని అన్నారు.        

  • Loading...

More Telugu News