Andhra Pradesh: సింహం సింగిల్ గానే వస్తుంది: బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు

  • వచ్చే సంవత్సరం ఎవరితోనూ పొత్తుండదు
  • ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తాం
  • మహానాడు సందర్భంగా బుద్ధా వెంకన్న

వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోరుకు సన్నద్ధమవుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మహానాడు వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మహానాడు నుంచే తమ పార్టీ అధినేత ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ విజయం ఖాయమని, సింహం సింగిల్ గానే వస్తుందని అన్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News