venkatesh: వెంకీ .. చైతూల మల్టీ స్టారర్ లో హీరోయిన్స్ ఖరారు!

- బాబీ దర్శకత్వంలో మల్టీ స్టారర్
- వెంకీ సరసన నయనతార
- చైతూ జోడీగా రకుల్ ప్రీత్
వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా దర్శకుడు బాబీ ఒక భారీ మల్టీ స్టారర్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలో ముందుగా కథానాయికల ఎంపికను పూర్తి చేశారు. వెంకటేశ్ సరసన నయనతారను .. చైతూ జోడిగా రకుల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
