Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. తోపులాట

  • మరో 58 గంటల పాటు సర్వదర్శన టోకెన్ల రద్దు
  • శ్రీవారి దర్శనానికి 56 గంటల సమయం
  • అంగప్రదక్షిణ టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేశారు. మరో 58 గంటల పాటు సర్వదర్శన టోకెన్లు అందుబాటులో లేవు. శ్రీవారి దర్శనానికి 56 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ తగ్గిన అనంతరం సర్వదర్శనం టోకెన్లను తిరిగి కొనసాగించనున్నారు. కాగా, సర్వదర్శనం స్లాట్‌ ద్వారా ఇప్పటివరకు మొత్తం 5,42,308 మంది టోకెన్లను పొందారు. అంగప్రదక్షిణ టోకెన్ల కోసం కూడా భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయినట్లు తెలిసింది.              

  • Loading...

More Telugu News