dalith: దళితుడిని కట్టేసి విచక్షణారహితంగా రాళ్లతో కొట్టి చంపిన వైనం

  • గుజరాత్‌లో ఘటన
  • వీడియో పోస్ట్ చేసిన జిగ్నేశ్‌ మేవానీ
  • దళితులకు గుజరాత్‌ క్షేమదాయకం కాదని వ్యాఖ్య

దళితుడిని తాళ్లతో కట్టేసి విచక్షణారహితంగా రాడ్లతో కొట్టి చంపిన అతి దారుణ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ముఖేష్‌ వనియా అనే వ్యక్తి తన భార్యతో కలిసి రాజ్‌కోట్‌లో చెత్త ఏరుకుని జీవనం సాగించేవాడు. నిన్న ఉదయం ఓ కర్మాగారం వైపునకు వెళ్లగా.. అతడిని అడ్డుకున్న కొందరు ఉద్యోగులు దొంగ అని ఆరోపిస్తూ చావబాదారు. అంతేకాదు, ఆ దళితుడి భార్యపై కూడా కర్రలతో దాడి చేశారు. ముఖేష్‌ భార్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.

ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేసి, దళితులకు గుజరాత్‌ క్షేమదాయకం కాదని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ఉనా దాడికంటే ఇది అత్యంత దారుణ ఘటన అని, కుల ఘర్షణలతో అమాయకులు మృతి చెందుతున్నా తమ రాష్ట్ర సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

dalith
Gujarath
outrage
  • Error fetching data: Network response was not ok

More Telugu News