Karnataka: కర్ణాటక గవర్నర్‌పై కాంగ్రెస్‌ నేత అనుచిత వ్యాఖ్య

  • ప్రతి ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్‌ పేరు పెట్టుకోవాలి
  • ఆయన కంటే విశ్వాసం ప్రదర్శించేవారు ఎవరూ ఉండరు
  • గవర్నర్ బీజేపీకి విధేయుడై ఉన్నారు

కర్ణాటక అసెంబ్లీలో ఈ రోజు బీజేపీకి ఎదురైన అనుభవంపై మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ తాజాగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర ప్రథమ పౌరుడు, గవర్నర్ వాజుభాయి వాలాపై అనుచిత వ్యాఖ్య చేశారు. వాజుభాయి వాలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ప్రయత్నించారని, మెజారిటీ ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అకాశం ఇవ్వలేదని అన్నారు.

అంతేగాక, ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన వ్యక్తిని నియమించారని, అసలైన విధేయత అనే పదానికి గవర్నర్ వజూభాయ్ వాలా ఓ అర్థంలా మారారని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్‌ వాలా అని పేరు పెట్టుకోవాలేమో అని, ఆయన కంటే విశ్వాసం, విధేయతలను ప్రదర్శించేవారు ఎవ్వరూ ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News