Karnataka: రెండు ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు ఎమ్మెల్యేల తరలింపు!

  • తాజ్ కృష్ణలో కొనసాగుతున్న కర్ణాటక సీఎల్పీ సమావేశం
  • హైదరాబాద్ చేరిన జేడీఎస్ నేతలు కుమారస్వామిగౌడ, రేవన్న 
  • స్టార్ హోటల్  నోవాటెల్ లో తమ ఎమ్మెల్యేలను కలవనున్న నేతలు 

కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను నిన్న బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యేలను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, గులాంనబీ ఆజాద్, ఈరోజు ఇక్కడికి చేరుకున్నారు. స్టార్ హోటల్ తాజ్ కృష్ణలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నిర్వహిస్తున్న సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. కాగా, జేడీఎస్ నేతలు కుమారస్వామిగౌడ, రేవన్నలు కూడా హైదరాబాద్ చేరుకున్నారు.

విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ కృష్ణకు చేరుకున్నారు. అక్కడి నుంచి స్టార్ హోటల్ నోవాటెల్ లో బస చేసిన తమ ఎమ్మెల్యేలను వీరు కలుస్తారని తెలుస్తోంది. వీళ్లిద్దరూ అక్కడికి వెళ్లన పక్షంలో జేడీఎస్ ఎమ్మెల్యేలు తాజ్ కృష్ణకు వస్తారని సమాచారం. రేపు అసెంబ్లీలో బీజేపీ బలపరీక్ష చేసుకోనున్న సందర్భంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. కాగా, ఈరోజు రాత్రి పది గంటలకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలను రెండు ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు తరలించనున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News