saidharam tej: మరోసారి మెగాహీరో జోడీ కడుతోన్న అనుపమ పరమేశ్వరన్

  • 'తేజ్ ఐ లవ్ యు' జంటగా తేజు .. అనుపమ 
  • తేజు నెక్స్ట్ మూవీ కిషోర్ తిరుమలతో
  • ఒక కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్  

సాయిధరమ్ తేజ్ కి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దాంతో ఆయన ఆశలన్నీ కరుణాకరన్ సినిమా 'తేజ్ ఐ లవ్ యు' పైనే పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో వుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమా తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ చేయనున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలోను ఆయన జోడీగా అనుపమ పరమేశ్వరన్ నే తీసుకున్నారు. 'తేజ్ ఐ లవ్ యు' సినిమా టీజర్ చూసిన వాళ్లంతా కూడా ఈ జంట బాగుందంటూ నూటికి నూరు మార్కులు ఇచ్చేశారు. అందువలన తేజు నెక్స్ట్ మూవీలోనూ అనుపమనే తీసుకున్నారట. కథ పట్ల .. తన పాత్రపట్ల అనుపమ సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో మరో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ నటించనుండటం విశేషం.   

  • Loading...

More Telugu News