Karnataka: బీజేపీ శాసనసభాపక్ష నేతగా యడ్యూరప్ప ఎన్నిక

  • రాజ్ భవన్ కు బయలుదేరిన యడ్యూరప్ప, ఆ పార్టీ నేతలు
  • ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరనున్న యడ్డీ
  • కొత్త ప్రభుత్వాన్ని రేపు ఏర్పాటు చేస్తామంటున్న బీజేపీ నేతలు

కర్ణాటక బీజేపీ శాసనసభాపక్ష నేతగా యడ్యూరప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన ఎన్నికను ఏకగ్రీవం చేశారు. అనంతరం బీజేఎల్పీ నేత యడ్యూరప్ప, ఆ పార్టీ నేతలు రాజ్ భవన్ కు బయలు దేరారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్ కు  ఓ లేఖ సమర్పించనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని రేపు ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News