modi: అందుకే, కర్ణాటక విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాం!: ప్రధాని మోదీ

  • వారణాసిలో ఫ్లై ఓవర్ కూలడంపై మోదీ దిగ్భ్రాంతి
  • ఈ సంఘటన తీవ్రంగా కలచివేసింది
  • క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి కంటోన్మెంట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి పన్నెండు మందికి పైగా చనిపోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, వారణాసి ప్రమాదంతో కర్ణాటక విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నామని అన్నారు. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్ కూలిన సంఘటనలో
మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, ఈ సంఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News