Karnataka: కర్ణాటక విజయం అసాధారణం: ప్రధాని మోదీ

  • బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నా ధన్యవాదాలు
  • భాష ఏదైనా, మనమంతా ఒక్కటేనని ఈ ఎన్నిక నిరూపించింది
  • విభజించు-పాలించు అనే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు
  • యావత్ భారదేశం అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుంది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం అసాధారణమని ప్రధాని నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. రాష్ట్రాల్లో భాష ఏదైనా, మనమంతా ఒక్కటేననే విషయాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయని, ఉత్తరాది పార్టీ అని బీజేపీపై ఉన్న ముద్రను చెరిపివేశాయని, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు బీజేపీ చేరువైందని అన్నారు.

ఎన్నికలు, స్వప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. దక్షిణ, ఉత్తర భారతదేశాలంటూ కాంగ్రెస్ పార్టీ విభజించి మాట్లాడుతోందని, విభజించు-పాలించు అనే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారని, విభజన రాజకీయాల వల్ల దేశానికి నష్టమని అన్నారు. పదేపదే అబద్ధాలు చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పిన మోదీ, యావత్ భారదేశం అభివృద్ధి చెందేందుకు బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News