Jagan: మాకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు: విజయసాయిరెడ్డి

  • జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
  • ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు
  • మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న టీడీపీ పాలనకు చరమగీతం పాడాలని భావిస్తున్నారని చెప్పారు. ఏపీలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు.

ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా విజయసాయి కూడా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని... రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. 

  • Loading...

More Telugu News