bjp: మిత్రుడు యడ్యూరప్ప 18న సీఎం అవుతారని ఆశిస్తున్నా: సుబ్రహ్మణ్య స్వామి

  • బీజేపీ విజయంపై నా అంచనాలు నిజమవుతున్నాయి
  • లింగాయత్ లను విభజించాలని చూసినప్పుడే చెప్పా
  • ట్విట్టర్లో స్వామి పోస్ట్ లు

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కర్ణాటక ఫలితాలపై స్పందించారు. తన మంచి మిత్రుడు యడ్యూరప్ప ఈ నెల 18న సీఎం అవుతారని ఆశిస్తున్నానంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. లింగాయత్ లను విభజించాలని సిద్ధరామయ్య చూసినప్పుడే తాను ఆ పార్టీ ఆత్మహత్యకు పాల్పడుతోందని చెప్పినట్టు గుర్తు చేశారు. కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తుందన్న తన ముందస్తు అంచనాలు నిజమవుతున్నాయన్నారు. ఇక కర్ణాటకలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాషాయ జెండా కిందకు చేరిన 23వ రాష్ట్రంగా అవుతుంది.

  • Loading...

More Telugu News