Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తెలుగు వాళ్లంటే ఇష్టమంటున్న పూజా హెగ్డే 
  • చెన్నయ్ లో మహేశ్ సినిమా రికార్డు
  • 'మహానటి' శాటిలైట్ హక్కులకు పోటీ

*  తెలుగు ప్రేక్షకులంటే తనకి చాలా ఇష్టమని, అందుకే బాలీవుడ్ కి వెళ్లినా మళ్లీ టాలీవుడ్ కే తిరిగి వచ్చేశానని చెబుతోంది కథానాయిక పూజా హెగ్డే. "తెలుగులో సినిమా తారల్ని ఎంతగానో అభిమానిస్తారు. ఇంతటి అభిమానాన్ని ఇంకెక్కడా చూడలేదు. అందుకే టాలీవుడ్ లోనే చేయాలని నిర్ణయించుకున్నాను' అని చెప్పింది. అయితే, ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్ లో అవకాశాలు లేకే ఇక్కడికి వచ్చిందన్నది అందరికీ తెలిసిందే.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన 'భరత్ అనే నేను' చిత్రం చెన్నయ్ లో రికార్డు కలెక్షన్లు చేస్తోంది. ఇప్పటివరకు ఆ నగరంలో 1.65 కోట్ల షేర్ ను వసూలు చేసి, మహేశ్ చిత్రాలలో ఇది రికార్డుగా నిలిచింది.
*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన 'మహానటి' చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం శాటిలైట్ హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఇప్పటికే ఓ ఛానెల్ 11 కోట్లను ఆఫర్ చేయగా, నిర్మాత కమిట్ కాలేదని, మరింతగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం.   

  • Loading...

More Telugu News