Karnataka: సర్వం సిద్ధం.. రేపు ఉదయం 8 గంటల నుంచి కర్ణాటక ఎన్నికల కౌంటింగ్‌

  • రేపు 222 స్థానాల ఫలితాలు వెల్లడి
  • 40 కేంద్రాల్లో కౌంటింగ్‌
  • భారీగా బందోబస్తు

దేశ ప్రజల దృష్టంతా తన వైపునకు తిప్పుకున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ల భవితవ్యం ఈవీఎంలలో ఓట్ల రూపంలో నిక్షిప్తమై వుంది. మరోపక్క, ఎగ్జిట్‌ పోల్స్‌ కర్ణాటకలో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్పలేకపోయాయి.

ఈ నేపథ్యంలో ఈ నెల 12న మొత్తం 222 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల కౌంటింగ్‌ కోసం సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం మొత్తం 40 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓట్ల కౌంటింగ్‌లో 11 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. రేపు సాయంత్రంలోగా అన్ని నియోజక వర్గాల ఓట్ల ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

  • Loading...

More Telugu News