Karnataka: కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేయని నటి రమ్య... మండిపడుతున్న నెటిజన్లు!

  • రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదు
  • ట్రాల్ చేస్తున్న నెటిజన్లు
  • నంబర్ వన్ సిటిజన్ ఆమేనంటూ సెటైర్లు

కన్నడ నటి, కాంగ్రెస్ నేత రమ్య, మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదట. దీంతో రాజకీయాలకు ఆమె పనికిరాదని, అసలు వాటి గురించి మాట్లాడే నైతిక విలువ కూడా ఆమెకు లేదని నెటిజన్లు ట్రాల్ చేయడం మొదలుపెట్టారు. మాండ్యా నియోజకవర్గంలోని కేఆర్ రోడ్డులోని పీఎల్డీ బ్యాంకు పోలింగ్ కేంద్రంలో రమ్యకు ఓటు హక్కు ఉంది.

కారణం ఏంటో వెల్లడి కాలేదుగానీ, ఆమె ఓటు వేయలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఓటు వేయని రమ్య నంబర్ వన్ సిటిజన్ అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై గతంలో అనేక విమర్శలు చేసిన రమ్య కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News