sharwanand: శర్వానంద్ తో పాటు సెట్స్ పైకి కాజల్

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 
  • ఒక కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ 
  • తదుపరి షెడ్యూల్ జూన్ 5 నుంచి  

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పారిస్ లో జరుగుతోంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను జూన్ 5వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో కాజల్ జాయిన్ కానుంది.

శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ ను .. కల్యాణి ప్రియదర్శన్ ను కథానాయికలుగా తీసుకున్నారు. ఆల్రెడీ కల్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక కాజల్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఇది తనకి 25వ సినిమా కావడంతో, శర్వానంద్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.   

  • Loading...

More Telugu News