snake: పోలింగ్‌ బూత్‌లోకి పాము.. ప్రాణ భయంతో పరుగులు తీసిన ఓటర్లు

  • కేఆర్‌పురం నియోజక వర్గంలో ఘటన 
  • క్యూలో నిలుచున్న వారంతా హడల్
  • వీడియో వైరల్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని కేఆర్‌పురం నియోజక వర్గంలోని కితానగర్‌ పోలింగ్‌ బూత్‌లోకి ఓ పాము ప్రవేశించడంతో ఓటర్లు భయపడిపోయారు. క్యూలో నిలుచున్న వారంతా ఆ పాముని చూసి పరుగులు తీశారు. పోలింగ్‌ బూత్‌ వద్దే ఆ పాము అటూ ఇటూ తిరుగుతూ కనపడింది. చివరకు అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పాము దృశ్యాలను అక్కడి ఓటర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. పాము కూడా ఓటు వేయడానికి వచ్చినట్లుందని నెటిజన్లు జోకులు వేస్తున్నారు.  

  • Loading...

More Telugu News