vote: కర్ణాటక ఎన్నికలు.. ఓటు వేయబోమని తెగేసి చెప్పి కూర్చున్న గ్రామ ప్రజలు

  • చిత్తాపూర్ తాలుకా తార్కస్‌పేట్ గ్రామంలో ఘటన
  • తమ సమస్యలు పట్టించుకోవట్లేదని మండిపాటు
  • గ్రామంలో 3,500 మంది జనాభా

తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని కర్ణాటకలోకి కల్‌బూరగి జిల్లాలోని చిత్తాపూర్ తాలుకా తార్కస్‌పేట్ గ్రామ ప్రజలు ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించారు. చాలా కాలం నుంచి తమకు గ్రామపంచాయతీ భవనం కట్టించాలని వేడుకుంటున్నామని, అయినప్పటికీ ఇప్పటికీ తమ సమస్యపై దృష్టిపెట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తాము ఓటు వేయబోమని తెగేసి చెప్పారు. ఆ గ్రామంలో మొత్తం 3500 మంది జనాభా ఉన్నారు.                        

  • Loading...

More Telugu News