Chandrababu: టీడీపీ అంతర్గత సర్వేలో టాప్ గ్రేడ్ సాధించిన 13 మంది ఎమ్మెల్యేలు ఎవరంటే...!

  • రాష్ట్ర స్థాయి సమావేశంలో పేర్లను చదివి వినిపించిన చంద్రబాబు
  • కార్యకర్తల నుంచి సేకరించిన సమాచారంతో గ్రేడింగ్
  • ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వే చేయిస్తామన్న సీఎం

ఎమ్యెల్యేల పనితీరుపై టీడీపీ జరిపిన అంతర్గత సర్వేలో 13 మంది ఎమ్మెల్యేలు టాప్ గ్రేడ్ సాధించారు. 70శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్న వారి పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయి సమావేశంలో చదివి వినిపించారు.

టాప్ గ్రేడ్ సాధించిన టీడీపీ ఎమ్మెల్యేలు వీరే:
ధూళిపాళ్ల నరేంద్ర (గుంటూరు జిల్లా), వల్లభనేని వంశీ, బోడ్ ప్రసాద్, గద్దె రామ్మోహనరావు, శ్రీరాం తాతయ్య (కృష్ణా), రాధాకృష్ణ, రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు (తూర్పు గోదావరి), చింతకాయల అయ్యన్నపాత్రుడు (విశాఖపట్నం), కోళ్ల లలితకుమారి (విజయనగరం), అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం).

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కార్యకర్తల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చామని చెప్పారు. నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ వద్ద ప్రతి ఒక్కరూ మంచి మార్కులు పొందాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వే చేయిస్తామని... మెరుగైన ఫలితాలను సాధించి, ఈ జాబితాలో చోటు సాధించేందుకు ఎమ్మెల్యేలంతా కృషి చేయాలని చెప్పారు.

  • Loading...

More Telugu News