Mahesh Babu: తమిళంలోకి డబ్ అవుతున్న 'భరత్ అనే నేను'

  • 200 కోట్ల క్లబ్ లో 'భరత్'
  • తమిళంలోకి అనువాదం
  • త్వరలోనే విడుదల తేదీ ప్రకటన

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' .. మహేశ్ బాబు కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. 200 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను తన సత్తా చాటింది. ఇక తమిళనాట తెలుగు వెర్షన్ కూడా మంచి వసూళ్లను సాధించింది. చెన్నైలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ఇది నిలిచింది.

 దాంతో ఇప్పుడు ఈ సినిమాను తమిళంలోకి అనువదించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అందుకు అవసరమైన డబ్బింగ్ పనులను మొదలెట్టేశారు. తమిళ వెర్షన్ ను అక్కడ ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో, మహేశ్ బాబు జోడీగా కైరా అద్వాని నటించిన సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్ కు ఏ స్థాయిలో  ఆదరణ లభిస్తుందనేది చూడాలి.   

  • Loading...

More Telugu News