Andhra Pradesh: 16న ఏపీ మంత్రిమండలి సమావేశం

  • అమరావతిలోని సచివాలయంలో సమావేశం
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం 

ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశం అమరావతిలోని సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో ఉన్న కేబినెట్ మీటింగ్ హాల్ లో నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News