Karnataka: బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు.. మమ్మల్నేం చేయలేరు!: చంద్రబాబు

  • కర్ణాటక ఎన్నికల తరువాత టీడీపీ సంగతి చూస్తామంటున్నారు
  • మా పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు
  • ప్రధానిపై సీఎంగా పోరాడుతున్నాను

కర్ణాటక ఎన్నికల తరువాత టీడీపీ సంగతి చూస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని, తాను ఏపీ ప్రజల తరఫున న్యాయం కోసం ప్రధానమంత్రిపై ముఖ్యమంత్రిగా పోరాడుతున్నానని అన్నారు.

 వైసీపీ మాత్రం లాలూచీ రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ తీరును ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని, రాష్ట్రాన్ని నాలుగేళ్ల పాటు మన కష్టంతో అభివృద్ధి చేసుకున్నామని, ఇందులో కేంద్ర సహకారం లేదని ప్రజలే అంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.          

  • Loading...

More Telugu News