Rahul Gandhi: ఇక్కడి ఐస్ క్రీమ్ కోసం మళ్లీ వస్తా!: రాహుల్ గాంధీ

  • బెంగళూరులోని ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లిన రాహుల్
  • ఇక్కడి ఐస్ క్రీమ్ అద్భుతంగా ఉంది
  • ఇక్కడి ఉద్యోగులు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు

కర్ణాటక ఎన్నికల ప్రచారం నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రోజంతా ప్రచారంతో అలసిపోయిన రాహుల్ బెంగళూరులోని 'రిచీ రిచ్' అనే ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లారు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

రోజంతా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాకు ఈ రోజును ముగించడానికి బెంగళూరులోని ఈ ఐస్ క్రీమ్ పార్లర్ గొప్ప ప్రదేశం!! ఇక్కడి ఐస్ క్రీమ్ అద్భుతంగా ఉంది. ఇక్కడి ఉద్యోగులు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. ఐస్ క్రీమ్ పార్లర్ యజమానితో, ఇక్కడికి వచ్చిన కొంత మంది కస్టమర్లతో మాట్లాడటం నాకు సంతోషం కలిగించింది. మళ్లీ ఇక్కడికి రావడానికి ఎదురుచూస్తున్నాను!’ అని రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News