Rahul Gandhi: కోట్లాది మంది ఆంధ్రులకు కన్నడ గడ్డపై భరోసా ఇచ్చిన రాహుల్ గాంధీ

  • అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తాం
  • విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తాం
  • తెలుగు ప్రజల పోరాటానికి ఇప్పటికే మద్దతిచ్చాం

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రులకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ నేతలు, ప్రజలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతుగా నిలిచిందని తెలిపారు.

పార్లమెంటులో సైతం తాము ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తామని చెప్పారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా... రాష్ట్రంలో 75 లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారని... వీరంతా ఏపీకి ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని... దీనిపై మీ వైఖరి ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రాహుల్ పైవిధంగా స్పందించారు. సూటిగా, స్పష్టంగా తన సమాధానాన్ని చెప్పారు. 

  • Loading...

More Telugu News