prabhas: హీరోయిన్ కోసం మరోసారి కొండలెక్కనున్న ప్రభాస్!

  • 'సాహో' షూటింగులో బిజీగా ప్రభాస్
  • నెక్స్ట్ మూవీ రాధాకృష్ణతో 
  • త్వరలో సెట్స్  పైకి        

'బాహుబలి' సినిమాలో కథానాయికను కలుసుకోవడానికి ప్రభాస్ .. జలపాతం మీదకి దూకుతున్నా లెక్కచేయకుండగా కొండనెక్కేస్తాడు. అలా ఎంతో కష్టపడి కొండపైకి చేరుకొని, కథానాయికను కలుసుకుంటాడు. ఈ ఎపిసోడ్ అంతా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సంగతిని అలా ఉంచితే .. మరోసారి కథానాయిక కోసం ప్రభాస్ కొండలనెక్కనున్నాడనేది తాజా సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'జిల్' ఫేమ్ రాధాకృష్ణతో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసమే ఆయన కొండలనెక్కనున్నాడని అంటున్నారు. కథానాయిక కోసం కొండకోనల్లో అన్వేషణ చేస్తూ ఆయన ముందుకే సాగే సన్నివేశాలు వుంటాయనీ .. ఇవే సినిమాకి హైలైట్ అని చెబుతున్నారు.        

  • Loading...

More Telugu News