Mahesh Babu: రాయలసీమ నేపథ్యంలో మహేశ్ 25వ మూవీ!

  • మహేశ్ నెక్స్ట్ మూవీ వంశీ పైడిపల్లితో 
  • ఎక్కువ భాగం షూటింగ్ అమెరికాలో 
  • కథానాయికగా పూజా హెగ్డే

'భరత్ అనే నేను' భారీ విజయాన్ని అందుకోవడంతో, మహేశ్ బాబు మాంఛి ఉత్సాహంతో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన పనుల్లోనే వంశీ పైడిపల్లి బిజీగా వున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్ల కోసం తాను అమెరికాలో తిరుగుతున్నట్టుగా ఆయన ఇటీవల ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగు అమెరికాలోనే ఎక్కువగా జరుగుతుందని చెప్పాడు. దాంతో అమెరికా నేపథ్యంలోనే ఈ కథను సిద్ధం చేశారని మహేశ్ బాబు అభిమానులు భావించారు. కానీ ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో రూపొందనుందనేది తాజా సమాచారం. ఈ తరహా కథను మహేశ్ ఇంతరవరకూ టచ్ చేయలేదని చెబుతున్నారు. తాజాగా బయటికి వచ్చిన ఈ విషయం .. మహేశ్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచడం ఖాయమని చెప్పొచ్చు. పూజా హెగ్డే ఈ సినిమాలో మహేశ్ జోడీ కడుతుందనే విషయం తెలిసిందే.    

  • Loading...

More Telugu News