chiranjeevi: 'సైరా'ను ఆ రోజునే రిలీజ్ చేయాలనుకుంటున్నారట!

  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా'
  • చిరూ సరసన నయనతార
  • భారీస్థాయిలో గ్రాఫిక్స్ వర్క్          

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ నిర్మాతగా 'సైరా' సినిమా రూపొందుతోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమా షూటింగు వేగాన్ని పెంచినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కి కూడా చాలా సమయం పట్టనుందట. అందువలన ఆ వైపు నుంచి కూడా పనులను వేగవంతం చేసేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది మే 9వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. గతంలో చిరంజీవి చేసిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' .. 'గ్యాంగ్ లీడర్' సినిమాలు ఇదే రోజున విడుదలై సంచలన విజయాలను అందుకున్నాయి. ఆ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని అదే రోజున విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.         

  • Loading...

More Telugu News