Chandrababu: చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందించిన కైలాష్ సత్యార్థి

  • ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’పై  కైలాష్ సత్యార్థి హర్షం 
  • మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
  •  ఈ కార్యక్రమంలో పాల్గంటానని చెప్పిన సత్యార్థి

దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచార ఘటన నేపథ్యంలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అంటూ నేడు ఏపీ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి కొనియాడారు. ఈమేరకు చంద్రబాబుకు ఆయన ఫోన్ చేసి అభినందించారు. ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’కు తాను మద్దతు ఇస్తున్నట్టు సత్యార్థి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కార్యకర్తలు పాల్గొంటారని, తాను కూడా హాజరవుతానని చంద్రబాబుతో సత్యార్థి కైలాష్ చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News