Sonia Gandhi: కర్ణాటక కోసం రంగంలోకి దిగిన సోనియా!

  • అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని చెబుతున్న సర్వేలు
  • అధికారాన్ని ఖాయం చేసుకునేందుకు సోనియాతో ప్రచారం
  • 8న బీజాపూర్ లో ర్యాలీ, బహిరంగ సభ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, అయితే, మెజారిటీకి కొంత దూరంలో ఆగుతుందని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, గెలుపును ఖాయం చేసేందుకు సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆమె, 8వ తేదీ నుంచి కర్ణాటకలో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ నుంచి పెద్ద నేతల్లో రాహుల్ గాంధీ మాత్రమే ఇప్పటివరకూ అన్నీ తానై ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.

గత రెండు నెలలుగా ఆయన పలుమార్లు కర్ణాటకలో పర్యటించి, తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనూ ఆయన చుట్టిరావడం గమనార్హం. ఇక సోనియా 8న బీజాపూర్ లో జరిగే ఎన్నికల ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన తరువాత, ఓ ఎన్నికల ప్రచారంలో సోనియాగాంధీ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవలి పార్టీ అంతర్గత సర్వేలో మరోసారి అధికారం చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని వెల్లడి కావడంతో, దాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాను కూడా వస్తానని సోనియా స్వయంగా వ్యాఖ్యానించడంతోనే ఆమె పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News