rain: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వడగళ్ల వానలు: వాతావరణ శాఖ

  • పలు చోట్ల పిడుగులు పడే అవకాశం
  • ఎల్లుండి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
  • సాధారణం కంటే అధికంగా నమోదవనున్న ఉష్ణోగ్రతలు

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీ, తెలంగాణల్లో ఈరోజు, రేపు వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు. ఎల్లుండి నుంచి రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని... సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News